కమెడియన్గా మంచి పేరు సంపాదించిన సునీల్ 'అందాల రాముడు' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత రాజమౌళి 'మర్యాద రామన్న' సినిమాతో మంచి హీరోగా పాపులర్ అయ్యాడు. 'పూల రంగడు' సినిమాతో సిక్స్ ప్యాక్ బాడీతో సీనియర్ హీరోలకు కూడా పోటీగా నిలిచాడు. ఆ తర్వాత సునీల్ కెరీర్ కొంచెం స్లోగా నడిచింది. 'మిస్టర్ పెళ్ళికొడుకు', 'భీమవరం బుల్లోడు' సినిమాలతో వరుస పరాజయాలు చవిచూశాడు. ఫెయిల్యూర్స్కి కారణాల్ని అన్వేషించిన సునీల్, కెరీర్ని మళ్ళీ గాడిన పెట్టేందుకు తగిన చర్యలు తీసుకున్నాడు. కథల ఎంపికలో జాగ్రత్తలతో దూసుకెళ్ళాలని నిర్ణయించుకున్నాడు.
చకచకా సినిమాలు చేసెయ్యాలనుకోకుండా ఆగి, మంచి కథలు ఎంచుకోవాలనుకున్న సునీల్కి 'కృష్ణాష్టమి' రూపంలో మంచి సబ్జెక్ట్ దొరికింది. ఈ సినిమాకి వాసు వర్మ దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రం తర్వాత 'బిందాస్' ఫేం వీరు పొట్ల దర్శకత్వంలో సినిమాకి కమిట్ అయ్యాడు సునీల్. ఈ సినిమాకి 'వీడు గోల్డ్ ఎహె' అనే క్యాచీ టైటిల్ని పెట్టారు. సినిమా ఫస్ట్ లుక్తోనే సూపర్ హిట్ అనే టాక్ రాబట్టుకుందీ చిత్రం. సుంకర రామబ్రహ్మం నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది.
|