'అందాల రాక్షసి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సొట్ట బుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి. తాజాగా ఆమె నటించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. 'భలే భలే మగాడివోయ్' సినిమాతో ఆమెను ఆదృష్ట దేవత వెంటాడింది. అందుకే వరుస విజయాలను సొంతం చేసుకుంది. ఇప్పుడు 'లచ్చిందేవికి లెక్కుంది' అంటూ మరోసారి సందడి చేయనుంది. ఈ సినిమాలో లావణ్య దేవి, ఉమాదేవి, అంకాలమ్మ అనే మూడు డిఫరెంట్ గెటప్స్లో కనిపించనుందిజ క్రైమ్ కామెడీ కధాంశంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నవీన్ చంద్ర హీరోగా నటించాడు. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి చేతిలో అల్లు శిరీష్ హీరోగా నటిస్తోన్న ఓ సినిమా ఉంది.
అందంతోనే కాకుండా అభినయంతో కూడా ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ, క్షణం తీరిక లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. యంగ్ హీరోలతో నటిస్తూ, సీనియర్ హీరోల పక్కనా ఒదిగిపోతూ తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తోన్న లావణ్య త్రిపాఠి చిత్రంగా ఏ పాత్రలో అయినా సత్తా చాటుతోంది. ఈ జనరేషన్ హీరోయిన్లలో హీరోలందరి పక్కనా సెట్ అయిపోయే గ్లామర్ మ్యాజిక్ లావణ్యకే సొంతమేమో. 'అందాల రాక్షసి' అనే చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చి, 'భలే భలే మగాడివోయ్'తో పెద్ద కమర్షియల్ సక్సెస్ అందుకుని, 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రంతో ఇండస్ట్రీలో లక్కీ మస్కట్ అనిపించుకుంటున్న లావణ్యకి ఆల్ ది బెస్ట్.
|