అడవి శేష్, ఆదా శర్మ జంటగా తెరకెక్కుతున్న 'క్షణం' ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ పోలీస్ పాత్రలో కనిపించబోతోంది. తాజాగా 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో నాగార్జునతో స్టెప్పులేసిన ఈ భామ ఇప్పుడు ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్గా కనిపించబోతోంది. ఈ పాత్ర కోసం అనసూయ చాలా కసరత్తులు చేసిందట. పోలీస్ పాత్రకు తాను న్యాయం చేయగలననే నమ్మకంతో డైరెక్టర్ ఈ సినిమాలో తనకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకున్నానని చెబుతోంది అనసూయ. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే యోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. కనిపించకుండా పోయిన మూడేళ్ల పాపను ఎలా వెతికి పట్టుకున్నారన్నది ఈ సినిమా కథాంశం. ఈ రియలిస్టిక్ కథాంశాన్ని డైరెక్టర్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకుల్ని హత్తుకునేలా ఉంటుందట. సినిమాలోని ప్రతీ ఫ్రేమ్ కొత్తగా, చూస్తున్న ప్రేక్షకునికి థ్రిల్ కల్గించేలా ఉంటుందట. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ లాంఛనంగా విడుదల చేశారు.
|