లాస్య. బుల్లితెరపై చాలా కాలంగా క్యూట్ యాంకర్గా అభిమానం సంపాదించింది. అయితే ఈ మధ్య బుల్లితెరపై లాస్య సందడి కనిపించడం లేదు. దాంతో లాస్యపై చాలా రూమర్స్ వచ్చాయి. రవి - లాస్య పెయిర్ బుల్లితెరపై చేసిన సందడి అంతా ఇంతా కాదు. లాస్య కనిపించకపోవడంతో రవితో లాస్యకు రకరకాల గొడవలు వచ్చాయంటూ వార్తలు రావడంతో ఆమె అభిమానులకు అసలు సంగతి తెలియక తికమక పడ్డారు. అంతేకాదు ఈ మధ్య యంగ్ హీరో రాజ్ తరుణ్తో లాస్య పెళ్లయిపోయిందనే గాసిప్ కూడా వచ్చింది.
ఆ విషయంపై రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చేశాడు. కానీ ఇప్పుడు లాస్య సడెన్గా వెండితెరపై హీరోయిన్గా మెరిసింది. క్రిష్ణ కిషోర్.టి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఆ సినిమాలో హీరోయిన్గా లాస్య నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయ్యింది. 'రాజా మీరు కేక' టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. హాట్ బ్యూటీ రేష్మీతో 'గుంటూర్ టాకీస్' సినిమాకి నిర్మాత అయిన ఎమ్. రాజ్కుమార్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి లాస్య హీరోయిన్ అయిపోయింది. ఆమెపై వచ్చిన గాసిప్స్ అన్నింటికీ ఈ తాజా పోస్టర్తో బ్రేక్ పడిపోయినట్లే. బుల్లితెరపై ఆమె అదృశ్యానికి కారణం వెండితెరపై ఆమె అప్పియరెన్స్కి మేకోవర్ కోసమే అని ఇప్పుడు తెలుస్తోంది. ఏది ఏమైనా హాట్ యాంకర్స్ రేష్మీ, అనసూయల బాటలోనే క్యూట్ యాంకర్ లాస్య కూడా నడవాలనుకోవడం విశేషం.
|