చాలా మందికి చిరంజీవిని కలవడం లైఫ్ టైం అచ్చీవ్మెంట్. సినిమాల్లో ఉన్నప్పుడు అభిమానులతో చిరుకి ఇంటరాక్షన్ ఎక్కువగా ఉండేది. కానీ రాజకీయాల్లోకి వెళ్లాక చిరు, అభిమానులకి మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది. మళ్లీ ఇప్పుడు ఆ గ్యాప్ ఫిల్ కానుంది. ఎందుకంటే చిరంజీవి అభిమానులకు అత్యంత దగ్గరగా వస్తున్నాడు. అదే బుల్లితెర ప్రోగ్రాం 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ద్వారా. ఈ ప్రోగ్రాంకి చిరంజీవి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. చిరంజీవి సినిమాల్లో మెగాస్టారే కాకుండా, రాజకీయాల్లో కేంద్రమంత్రిగా ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి. అలాంటిది సాధారణ వ్యక్తులైన ఈ ప్రోగ్రాం కంటెస్టెంట్స్తో ఎంతో కలివిడిగా చాలా ప్రేమగా మాట్లాడుతుంటే చాలా ముచ్చటేస్తోంది. సరదా సరదాగా సాగుతోంది ఈ షో. అయితే ఈ షోకి మరికొంత జోష్ అవసరం అనిపిస్తోంది.
ఈ మధ్యే కదా ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది. ముందు ముందు చిరు ఇంకా జోష్తో ఈ షోను నడిపించగలరు. ఇప్పటికే తనదైన కటింగ్స్, స్టైల్తో అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ ప్రోగ్రాంకి వచ్చే కంటెస్టెంట్స్ చిరంజీవిని అంత దగ్గరగా చూసి ఎగ్జయిట్మెంట్ ఫీలవుతున్నారు. ఈ నెల 13న స్టార్ట్ అయింది ఈ షో. ఇంతవరకూ వెండితెరపై మాత్రమే సందడి చేసిన చిరంజీవి ఈ ప్రోగ్రాం ద్వారా బుల్లితెరపైకొచ్చి, మరింత సందడి చేస్తున్నారు.
|