బాలయ్య - కె.ఎస్. రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రానికి 'జై సింహా' అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. తాజాగా టైటిల్ లోగోతో కూడిన ఫస్ట్లుక్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్ నందమూరి అభిమానుల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్టీఆర్ విగ్రహం, చుట్టూ వేలాది మంది జనం, మధ్యలో బాలయ్య పోస్టర్ చాలా నిండుగా కనిపిస్తోంది. అయితే ఈ పోస్టర్ని చూస్తే ఇందులో బాలయ్య పాత్ర ఏదో ఉద్యమానికి నాయత్వం వహిస్తున్నట్లుగా ఉంది. అయితే ఈ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా కానీ పోస్టర్ మాత్రం అద్భుతంగా ఉంది. కాగా ఈ సినిమాని సి.కె. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రమిది.
పొలిటికల్ టచ్ ఉన్న కాన్సెప్ట్ అట. పాలిటిక్స్పై పవర్ఫుల్ పంచ్ డైలాగులు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ కానున్నాయనీ తెలుస్తోంది. నయనతార మెయిన్ హీరోయిన్ కాగా, హరిప్రియ, నటాషా జోషి ఇతర హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలయ్య గెటప్ కొత్తగా ఉండనుంది. గతంలో 'సింహా' టైటిల్తో తెరకెక్కిన సినిమాలు బాలయ్యకి బాక్సాఫీస్ రికార్డులయ్యాయి. అదే సౌండింగ్తో వస్తోన్న ఈ తాజా సినిమాపైనా భారీగా అంచనాలున్నాయి. ఇది బాలయ్యకి 102వ చిత్రం. కాగా మరో పక్క బాలయ్య - తేజ కాంబినేషన్లో 'ఎన్టీఆర్' చిత్రం తెరక్కెనుంది. వచ్చే ఏడాది సెట్స్ మీదికెళ్లనుంది ఈ చిత్రం. స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ చిత్రానికి బాలయ్యే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ సినీ, రాజకీయ ప్రస్థానంలోని ముఖ్య ఘట్టాలను ఈ చిత్రంలో చూపించనున్నారు.
|