దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు తక్కువ సినిమాలతోనే మధుర శ్రీధర్. ఆడియో కంపెనీ నుంచి దర్శకత్వం లోకి, ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన మధుర శ్రీధర్ తాజాగా ‘ఓం మంగళం మంగళం’ అనే డిఫరెంట్ టైటిల్తో సినిమా రూపొందిస్తున్నారు. ఆల్రెడీ ఆయన ‘లేడీస్ అండ్ జెంటిల్మెన్’ సినిమా చేస్తున్నారు.
తన వద్ద అసిస్టెంట్గా పనిచేసిన సంజీవ్ను తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయం చేస్తున్న మధుర శ్రీధర్, ఈ సినిమాని ఆగస్ట్లో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిసింది. సంజీవ్ గతంలో హిందీలో ‘లాగిన్’ అనే సినిమాని రూపొందించాడు. భిన్నమైన కథాంశంతో యూత్ని ఆకట్టుకునేలా ఈ సినిమా వుంటుందని సమాచారమ్.
నటీనటుల ఎంపిక జరుగుతోంది. సినిమా టైటిల్ దగ్గర్నుంచి ప్రతి అంశమూ డిఫరెంట్గా ఉండేలా నిర్మాత మధుర శ్రీధర్ ప్లాన్ చేస్తున్నారు. చిన్న సినిమాల్ని క్వాలిటీతో రూపొందించడంలో నేర్పరి అయిన మధుర శ్రీధర్ ఈ సినిమాని కూడా అలానే రూపొందించనున్నారట. పూర్తి వివరాలు రానున్న కొద్ది రోజుల్లో తెలియనున్నాయి.
|