కావలిసిన పదార్ధాలు:
గోదుమ పిండి.
బెల్లం
యాలకులు
గసగసాలు
తయారుచేసే విధానం:
ముందుగా గోదుమ పిండిలో కొన్ని నీళ్ళు పోసి మెత్తగా తడిపి ముద్ద చేసి వుంచాలి. తరువాత స్టౌ వెలిగించి గిన్నెలో 8 గ్లాసుల నీళ్ళు పోసి బెల్లం వేయాలి. ఈ నీరు మరిగేవరకు నానబెట్టిన పిండి ముద్దను తీసుకుని చెక్క పీటపై పొడువుగా, సన్నగా తాళికలు చేయాలి. సన్నగా చేసినట్లయితే బెల్లం పాకంలో బాగా ఉడుకుతాయి. తరువాత మరుగుతున్న బెల్లం పాకం లో ఈ తాళికలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా పది నిముషాలు ఉడకనివ్వాలి. తరువాత యాలకుల పొడి, గసగసాలు వేసి కలపాలి. అంతే వేడి వేడి పాయసం రెడీ!!.....
|