కావలిసిన పదార్ధాలు:
పెరగన్నం
మిరియాల పొడి
ఆవాలు
శనగపప్పు
కరివేపాకు
ఎండుమిర్చి
తయారు చేసే విధానం:
ముందుగా మెత్తగా వండిన అన్నంలో పెరుగు, ఉప్పు వేసి కలిపి వుంచాలి. తరువాత అందులో మిరియాల పొడి వేయాలి. తరువాత బాణాలి లో నూనె వేసి అది కాగాక ఆవాలు , శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. ఈ పోపు మిశ్రమాన్ని కలిపిన పెరగన్నంలో, మిరియాలపొడి మీద వేసి బాగా కలపాలి. ఇష్టమైతే జీడిపప్పు వేసుకోవచ్చు.
అంతే పెరుగన్నం రెడీ... దీనినే దద్దోజనం అని కూడా అంటారు.
|