తెలుగు సినిమాల్లో దూసుకుపోతున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ సినిమాలూ చేస్తోంది. తెలుగులో ఎంత బిజీగా వున్నా టైమ్ చూసుకుని హిందీ సినిమాల్లో కూడా చేస్తానని చెప్పిందీ బ్యూటీ. హిందీలో ‘యారియాన్’ సినిమాలో ఇప్పటికే నటించిన రకుల్, ‘సిమ్లా మిర్చి’ అనే సినిమాకి కమిట్ అయ్యింది. రమేష్ సిప్పి డైరెక్షన్లో రానుందీ సినిమా. తమిళంలో కూడా రకుల్ రెండు సినిమాలు చేసింది. తమిళం నుంచి ఇంకా ఆఫర్లు వస్తున్నా తెలుగులో బిజీగా వుండడంతో తమిళ సినిమాలకు కమిట్ కావడంలేదట కొత్తగా. తెలుగులో ‘పండగ చేస్కో’, ‘కిక్`2’తోపాటు ఇంకో సినిమా చేస్తోంది రకుల్ ప్రీత్సింగ్. తెలుగు, హిందీ సినిమాలు చేస్తూ, ఖాళీ కాస్త దొరికినా తమిళ సినిమాలకు టైమ్ కేటాయిస్తానని చెప్పింది రకుల్ ప్రీత్సింగ్. తొందరగా ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటే ఫెయిల్యూర్స్ ఎదురవుతాయి కాబట్టి, ఆలస్యంగా అయినా జాగ్రత్తగా సినిమాలు ప్లాన్ చేసుకుంటానని చెప్పే రకుల్ ప్రీత్సింగ్, అనుకోకుండా సినిమాల్లోకొచ్చి, ఈ స్థాయికి చేరుకోవడం ఆనందాన్నిస్తోందని, మంచి నటిగా ఏ భాషలో అయినా గుర్తింపు తెచ్చుకోవాలనే కోరికతోనే సినీ రంగంలోకి వచ్చానని అంటోంది.
|