కావలసిన వస్తువులు: కొరమీను చేప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం, ఒక నిమ్మకాయ రసం, నూనె (వేయించటానికి సరిపడా).
ముందుగా చేప ముక్కలని అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం,నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట నానిన తరువాత బాణీలో నూనె వేడి చేసుకొని చేప ముక్కలని డీప్ ఫ్రై చేసుకోవాలి. తరువాత చేపముక్కలపై కొత్తిమీర చల్లుకొని, నిమ్మకాయ, ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటే వేడి వేడి ఆంధ్రా చేపల ఫ్రై రెడీ.
|