Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
srikant, nikhita terror

ఈ సంచికలో >> సినిమా >>

వరుణ్‌ సరసన కొత్త భామ

new heroin with varun

‘ముకుంద’తో హీరోగా తెలుగు తెరపైకొచ్చిన వరుణ్‌తేజ సరసన ముంబై ముద్దుగుమ్మని హీరోయిన్‌గా సెలక్ట్‌ చేశాడట పూరి జగన్నాథ్‌. హీరో నితిన్‌తో చేయాల్సిన సినిమాని కొన్ని కారణాలతో పక్కన పెట్టిన పూరి, ఆ సినిమాకి బదులు వరుణ్‌తో కొత్త సినిమాని పట్టాలెక్కిస్తున్నాడు. వరుణ్‌ ప్రస్తుతం ‘కంచె’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా కొత్త హీరోయిన్‌కే ప్రిఫరెన్స్‌ ఇచ్చారు.  ప్రజ్ఞా జైస్వాల్‌ వరుణ్‌ సరసన ‘కంచె’ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. పూరి సినిమా దగ్గరకు వస్తే, మోడల్‌గా పలు ప్రకటనల్లో కనిపించిన దిషా పతానీని పూరి హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారమ్‌. దిషా పతానీకి బాలీవుడ్‌లో పలు ఆఫర్స్‌ వచ్చినా, ఏవీ పట్టాలెక్కలేదు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు జాకీష్రాఫ్‌ తనయుడు టైగర్‌ ష్రాఫ్‌తో దిషా పతాని ఓ సినిమాలో నటించాల్సి ఉంది. అయితే అది కూడా కొన్ని కారణాలతో బెడిసి కొట్టిందట. బాలీవుడ్‌లో ఇలాంటి గందరగోళం ఎదుర్కొన్న హీరోయిన్లకు తెలుగులో మంచి లైఫ్‌ ఉంటుందని అంటారు. అది దిషా పతానీకి కూడా తెలుగులో పూరి సినిమాతో మంచి లైఫ్‌ దక్కొచ్చు.

మరిన్ని సినిమా కబుర్లు
No romeo got hansika