టాలీవుడ్లో ‘ఉలవచారు’ హల్చల్ చేస్తోంది. దర్శక నిర్మాత కూచిపూడి వెంకట్ స్థాపించిన ‘ఉలవచారు’ రెస్టారెంట్ గురించే ఇదంతా. ‘ఉలవచారు’ గురించిన చర్చ టాలీవుడ్లో బాగానే జరుగుతోంది. చాలామంది సినీ ప్రముఖులు ఈ ‘ఉలవచారు’కి ఫిదా అయిపోతున్నారు. ఈ రెస్టారెంట్లో ‘రాజుగారి కోడి బిర్యానీ’ అనే ఓ ఐటమ్కి అయితే అభిమానులు ఎక్కువైపోయారు.
సినీ నిర్మాత, నటుడు మోహన్బాబు క్యాంప్ నుంచి రోజూ 10 నుంచి 15 వరకూ ఈ బిర్యానీలకు ఆర్డర్ వస్తోందంట. మోహన్బాబు వద్ద పనిచేసేవారు కావచ్చు, మోహన్బాబు కుటుంబ సభ్యులు కావొచ్చు.. మొత్తంగా మోహన్బాబు క్యాంప్ నుంచి ‘ఉలవచారు’కి అభిమానులు ఎక్కువగా వున్నారట.
జూబ్లీహిల్స్లోని బాలకృష్ణ ఇంటి సమీపంలో వెలసింది ఈ ‘ఉలవచారు’ రెస్టారెంట్. కాన్సెప్ట్ రెస్టారెంట్గా రూపొందిన ఈ ఉలవచారు రెస్టారెంట్.. అతి తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకోవడంతో, సినీ పరిశ్రమలో ఉలవచారు గురించి తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదేమో అన్పిస్తోంది.
|