మళ్ళీ సినిమాల జాతర షురూ అవబోతోంది. వర్షాకాలం.. ప్రేక్షకులకు మాంఛి కిక్ ఇవ్వడంలో భాగంగా, వరుస సినిమాలు దూసుకొస్తున్నాయి. భారీ అంచనాలతో తెరకెక్కిన రామ్చరణ్ ‘ఎవడు’ జులైలో విడుదల కానుంది. రవితేజ చాలా ఆశలు పెట్టుకున్న ‘బలుపు’ కూడా ఈ జులైలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక, త్రీడీ టెక్నాలజీలో చాలా ఖర్చు చేసి, టెక్నికల్ అద్భుతంగా కళ్యాణ్రామ్ నటించి, నిర్మించిన ‘ఓం’ కూడా ఈ జులైలోనే ప్రేక్షకుల్ని అలరించనుంది. సుశాంత్ ‘అడ్డా’, గోపీచంద్ ‘సాహసం’ కూడా ఈ జులైలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
రామ్చరణ్ హీరోగా ‘దిల్’ రాజు నిర్మించిన ‘ఎవడు’ జులై 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు. శృతిహాసన్, అమీ జాక్సన్ ఈ సినిమాలో హీరోయిన్లు. బలుపు జూన్ 28న విడుదలవుతోంది. ‘సాహసం’, ‘అడ్డా’ జులై 12న ప్రేక్షకుల ముందుకొస్తాయి. ‘ఓం’ జులై 19న విడుదల కానుంది. అయితే వీటిల్లో ‘సాహసం’ వెనక్కి వెళ్ళొచ్చుననే ప్రచారం జరుగుతోంది.
|