‘మున్నా’తో ఫెయిలయినా, ‘బృందావనం’ సినిమాతో దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి, మళ్ళీ ‘దిల్’ రాజు నిర్మాణంలోనే ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. అదే ‘ఎవడు’. స్టయిలిష్ యాక్షన్ థ్రిల్లర్గా.. ఈ సినిమా గురించి సినిమా ప్రారంభోత్సవంలోనే చెప్పాడు వంశీ పైడిపల్లి.
రామ్చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్, కాజల్ అతిథి పాత్రల్లో కన్పించనున్నారు. వీరిద్దరి పాత్రలూ ఈ సినిమాకి టర్నింగ్ పాయింట్స్.. అని రామ్చరణ్ కూడా చెబుతూనే వున్నాడు. ‘రచ్చ’, ‘నాయక్’ సినిమాలతో మంచి జోరు మీదున్న చరణ్, ‘ఎవడు’తో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే ధీమా అతని అభిమానుల్లో వుంది.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 30న సినిమా ఆడియో విడుదల చేస్తున్నారు. శృతిహాసన్, అమీజాక్సన్ గ్లామర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు.
ఆల్రెడీ విడుదలైన టీజర్కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియోకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి.
|