ఈ సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమ ఇచ్చిన వరుస విజయాలతో సినీ అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. అభిమానులు నిజమైన దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలను ఈ సంవత్సరం సినిమాలతో కలిసి చేసుకున్నట్లే. అంతటి సంతృప్తినిచ్చాయి ఈ సంవత్సరం సినిమాలు. మల్టీస్టారర్ మూవీ పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన 'గోపాల గోపాల'తో బోణీ కొట్టి నిన్నటి 'శ్రీమంతుడు' వరకూ వరుసగా పెద్ద హీరోలు తమ అభిమానులకు ఎంతో ఆనందాన్ని పంచాయి. ఇక ఈ సంవత్సరమే విడుదలైన 'బాహుబలి' సాధించిన విజయం సంగతి చెప్పకనే అక్కర్లేదు. 'శ్రీమంతుడు' సినిమా కేవలం సినిమాలాగానే కాకుండా సమాజంపై ఎంతో ప్రభావం చూపింది.
ఇకపోతే ద్వితీయార్థం మొదలు, సంవత్సరాంతానికి చేరేసరికి వారసులంతా వరుసగా కూెడబలుక్కుని సినిమాలకు రెడీ అయిపోయారు. వారసులే కాదు. మాతో మాకే పోటీ అన్నట్లుగా కొడుకులతో తండ్రులు పోటీ.. తండ్రులకు కొడుకులు పోటీ అన్నట్లుగా పోటీపడి సీనియర్ నటులు, తమ జూనియర్స్తో పోటీకి దిగుతున్నారు. ఎలా చూసినా తెలుగు సినీ పరిశ్రమ గుక్కతిప్పుకోని విధంగా వరుస రిలీజ్లతో కళకళలాడనుంది రానున్న రోజుల్లో.
|