వెంకటేష్ 'గోపాల గోపాల' సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్లో కొన్ని కథలు విన్నా, అవేవీ వెంకీ టేస్ట్కి తగ్గట్లుగా లేవట. ఫ్యామిలీ ఆడియన్స్లో వెంకటేష్కి స్పెషల్ క్రేజ్ ఉంది. 'దృశ్యం' సినిమాతో కొత్త జోనర్ సినిమా చేసిన వెంకీ, 'గోపాల గోపాల'తో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్తో ఆడియన్స్ని అలరించాడు. దాంతో అలాంటి సినిమాల వైపే వెంకీ మొగ్గు చూపుతున్నాడట. అలా కొత్త కథల్ని ఎంపిక చేసుకోవడంలో వెంకీ టైమ్ తీసుకున్నట్లు తెలుస్తుంది. చాలా గ్యాప్ తర్వాత వెంకటేష్ ఎట్టకేలకు ఒక డైరెక్టర్ను ఎంపిక చేసుకున్నాడు. 'భలే భలే మగాడివోయ్' సినిమాతో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాను అందించి హిట్ కొట్టిన మారుతికి తన సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. వెంకీ - మారుతి కాంబినేషన్లో ఇదివరకే సినిమా రావాల్సి ఉన్నా అది ఆలస్యమయ్యింది. మారుతి తాను స్వయంగా రాసుకున్న కథ ఒకటి వెంకటేష్కు విన్పించగా, కథ విన్న వెంకటేష్ వెంటనే ఓకే చెప్పాడట.
ఈ సినిమాకు 'బంగారు బాబు' అనే టైటిల్ను పెట్టనున్నారు.ఈ సినిమాలో వెంకటేష్ పక్కన నయనతార హీరోయిన్గా నటించనుంది. డిశంబర్ 16న ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కానుంది. అంతేకాదు 'ఓనమాలు' డైరెక్టర్ క్రాంతి మాధవ్ చెప్పిన 'సంతోషం సగం బలం' అనే సినిమా కూడా ఆన్ ది వేలో ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ఇంత గ్యాప్ తీసుకున్నా ఒకేసారి రెండు సినిమాలతో విక్టరీ వెంకటేష్ అభిమానుల్ని ఫుల్ ఖుషీ చేయనున్నాడు.
|