సినిమా చూపిస్తా మావ సినిమాతో విజయాన్ని చవిచూసిన రాజశేఖర్ రెడ్డి, సరైన కమర్షియల్ మరియు సెన్సిబుల్ (సజీవమైన) సినిమా తీయడానికి ప్రయత్నించడమే తన ఆశయమని చెప్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఆర్యత్ సినీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఒక సినిమాను నిర్మించనున్నారు. బాక్సాఫీస్ దగ్గర అనూహ్య విజయం సాధించిన గుంటూరు టాకీస్ సినిమాతో తన కన్ఫ్యూజన్ కామెడీతో అందరి ప్రశంసలు అందుకున్న సిద్దూ హీరోగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్స్క్ మొదలుపెట్టినప్పటికీ, సినిమాకు సంబంధించిన నటీనటులు, మిగతా వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. సినిమాను సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాలని మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
|