వంశీ డైరెక్షన్లో వచ్చిన 'లేడీస్ టైలర్' సినిమా అప్పట్లో ఎంత సెన్సేషనో అందరికీ తెలిసిందే. రాజేంద్రప్రసాద్ నటనతో ఈ సినిమాకు అంత పాపులారిటీ వచ్చింది. ఆ సినిమాలోని ప్రతీ పాత్రను అద్భుతంగా డిజైన్ చేశాడు వంశీ. అప్పట్నుంచీ ఈ సినిమాకు సీక్వెల్ని తీయాలని అనుకుంటున్నాడు. కానీ కుదరలేదు. అందుకు టైం ఇప్పుడు కలిసొచ్చింది. కథ సిద్ధం చేసుకుని వంశీ ఆ పాత్రకు తగ్గ హీరో కోసం వెతుకులాట మొదలెట్టాడు చాలా కాలంగా. అయితే ఇప్పటికి హీరో దొరికాడు.
'తూనీగా, తూనీగా', కేరింత' వంటి సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న యంగ్ హీరో సుమంత్ అశ్విన్కు ఈ అవకాశం దక్కింది. గతంలో అల్లరి నరేష్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోందనే వార్తలు వచ్చాయి. కానీ కుదరలేదు. ఈ ప్రాజెక్ట్ సునీల్ దగ్గరకు కూడా వెళ్లింది. చివరికి సుమంత్ అశ్విన్కి ఓకే అయ్యింది. ఈ సినిమాలో హీరో ఫ్యాషన్ డిజైనర్గా కనిపిస్తాడు. అందుకే 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' అని టైటిల్ను పెట్టారు ఈ సినిమాకి. ఈ సినిమా సుమంత్ అశ్విన్లోని నటుడిని సవాల్ చేయనుంది. ఈ సినిమా ఖచ్చితంగా అశ్విన్కు సక్సెస్ తెచ్చిపెడుతంది అని భావిస్తున్నారు. అప్పటి 'లేడీస్ టైలర్' సినిమాకి ఇళయారాజా సంగీతం ఒక ఆకర్షణ అయితే, ఈ సీక్వెల్కి మణిశర్మ మ్యూజిక్ ఆకట్టుకోనుంది.
|