మంచు లక్ష్మీ మోహన్బాబు తనయగా సినీరంగంలో నటిగా, నిర్మాతగా విజయవంతంగా కొనసాగుతోంది. త్వరలోనే 'లక్ష్మీ బాంబ్' సినిమాతో మన ముందుకు వస్తోంది. ఈ సినిమాలో న్యాయవాదిగా నటిస్తోంది. ఈ పాత్ర తన నట జీవితంలో ఒక ఛాలెంజింగ్ పాత్రగా తీసుకుందట లక్ష్మీ. కోర్టులో న్యాయవాదిగా ఆమె వాదించే తీరు చూస్తే అందరూ షాకవుతారట. అందుకే దీనికి 'లక్ష్మీ బాంబ్' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా తర్వాత ఒక రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తుందట.
క్యూట్ లవ్ స్టోరీకి చక్కని వినోదం జోడించి ఆ సినిమాని తెరకెక్కించనున్నారట. తండ్రి మోహన్బాబుతో కలిసి ఒక సినిమా చేయాలనుకుంటోంది మోహన్బాబు తనయ. అయితే ఓ షరతు, ఆ సినిమాలో విలన్గా నటించాలని మంచువారమ్మాయి కలలుకంటోంది.. ఆ కల నిజం చేసుకుంటానని కూడా ధీమాగా చెబుతోంది. అలాంటి కథ దొరికితే ఆ సినిమాను తానే స్వయంగా నిర్మిస్తానంటోంది మంచు లక్ష్మి ప్రసన్న. మంచి కథలు ఉంటే, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా నిర్మిస్తానంటోంది లక్ష్మీ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'లక్ష్మీ బాంబ్' సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మోహన్బాబు తనయగా తెరంగేట్రం చేసిన అతి కొద్ది కాలంలోనే నటిగా తనదైన విలక్షణతను చాటుకున్న మంచు లక్ష్మి, తన తండ్రికి ప్రతినాయకురాలిగా కనిపించే రోజెప్పుడొస్తుందో వేచి చూడాలిక.
|