ఒక పక్క. వినాయక్తో 150వ చిత్రం చేసిన చిరంజీవి మరో సినిమాకి కూడా వినాయక్తో చేయాలని 'ఖైదీ' టైంలోనే అనుకున్నారు. అయితే మరో మాస్ డైరెక్టర్ బోయపాటి శీను డైరెక్షన్లో కూడా చిరంజీవి ఓ సినిమాకి కమిట్ అయ్యారు. ఈ రెండూ కాక మరో కొత్త స్టోరీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. అదే ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి బయోపిక్. తెలుగు నేలపై స్వాతంత్రోద్యమానికి ఆధ్యం పోసిన నాయకుడు ఉయ్యాలవాడ. ఈయన కథలో చిరంజీవి నటిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. 150వ సినిమా 'ఖైదీ'తో రికార్డులు సృష్టిస్తోన్న మెగాస్టార్ రీ ఎంట్రీలో చేయబోయే సినిమాల విషయంలో ఆచి తూచి ఆలోచించి అడుగులు వేస్తున్నాడు చిరంజీవి.
అప్పుడెప్పుడో ఈ సినిమమా చేయాలని అనుకున్నాడు చిరంజీవి. దీనికి పరుచూరి బ్రదర్స్ కథ కూడా రెడీ చేశారు. అదే కథని ఇప్పుడు తెర మీదికి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చిరంజీవి సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కూడా రామ్ చరణ్ నిర్మాణంలోనే తెరకెక్కుతోందన్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత చిరంజీవి చేయబోయే సినిమా బోయపాటితో ఉంటుందా? లేక వినాయక్తో ఉంటుందా అనేది ఇంకా తేలాల్సి వుంది. మొత్తానికి ఈ ఏడాదిలోనే చిరంజీవి నుండి రెండు మూడు సినిమాల వరకూ రావచ్చని అంచనా వేస్తున్నారు.
|