చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో ఓ ప్రయోగాత్మక చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ నెలాఖరుకే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ని స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతోంది. ఈలోగా చిత్ర యూనిట్ లొకేషన్స్ వేటలో పడింది. అందమైన లొకేషన్స్ కోసం జల్లెడ పడుతోంది. ఇప్పటికే పొలాచ్చిలోని కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ని సెలెక్ట్ చేశారు సుకుమార్ అండ్ టీమ్. పల్లెటూరి వాతావరణం నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అందులోనూ సుకుమార్ సినిమాలంటే లొకేషన్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
అందుకే డిఫరెంట్ లొకేషన్స్ని ఈ సినిమాలో చూపించి, మాయ చేయబోతున్నాడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. ఈ సినిమాలో చరణ్ లుక్ చాలా డిఫరెంట్గా ఉండబోతోంది. 'ధృవ' సినిమాతోనే చరణ్ లుక్స్లో చాలా ఛేంజెస్ వచ్చాయి. ఈ సినిమాకి ఆ ఛేంజెస్ మరింత రెట్టింపు కానున్నాయట. అంతేకాదు ఈ సినిమాలో తన లుక్ కోసం చరణ్ చాలా గ్ర్రౌండ్ వర్క్ చేశాడట. తొలిసారిగా సమంత, చరణ్తో జత కడుతోంది ఈ సినిమాలో. జగపతిబాబు ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపిస్తుండగా, యంగ్ హీరో ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అన్నట్లు ఓ ప్రముఖ యంగ్ హీరో ఈ సినిమాలో గెస్ట్ రోల్లో నటించబోతున్నాడని గాసిప్స్ వినవస్తున్నాయి. ఇది ఎంత నిజమో తెలీదు కానీ ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఈ న్యూస్ వెరీ హాట్ హాట్గా స్ప్రెడ్ అవుతోంది.
|