బాలీవుడ్ భామ రవీనాటాండన్, చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో నటించింది. మోహన్బాబు ఫ్యామిలీ నటించిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమాలో మోహన్బాబుకి జోడీగా కనిపించింది రవీనాటాండన్. ఈ సినిమాలో రవీనాటాండన్ని చూసినవారు, తెలుగు తెర ఈమెకు రెడ్ కార్పెట్ వేయడం ఖాయమంటున్నారు.
చాలాకాలం క్రిందట బాలకృష్ణతో ‘బంగారు బుల్లోడు’ సినిమాలోనూ, నాగార్జునతో ‘ఆకాశవీధిలో’ సినిమాలోనూ నటించి, తన అందాల ప్రదర్శనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రవీనాటాండన్, ఇన్నాళ్ళ తర్వాత తెలుగు తెరపై కనిపించడం పట్ల తెలుగు ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో ప్రేక్షకుల నుంచి రవీనాటాండన్కి వచ్చిన రెస్పాన్స్తో ఆమెకు తెలుగు తెరపై అవకాశాలు పెరిగేందుకు ఆస్కారం ఏర్పడింది.
మోహన్బాబు, విష్ణు, మనోజ్ ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమాలో నటించగా, వరుణ్ సందేష్, తనీష్ కూడా ఈ సినిమాలో నటించారు. ప్రణీత, హన్సికా మోత్వానీ ఈ సినిమాలో హీరోయిన్లు.
|