యంగ్ హీరో నితిన్ కధానాయకుడిగా ప్రేమకధా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. శ్రేస్ట్ మూవీస్ పతాకం మీద నిఖితారెడ్డి,సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.విక్రమ్ గౌడ్ సమర్పకులు.నితిన్ సరసన సుబాష్ ఘయ్ కాంచీ సినిమాతో పరిచయం అయిన బాలీవుడ్ కదానాయిక మిస్తీ జోడి కడుతోంది.జూన్ 2 న చిత్రీకరణ ప్రారంబి౦చుకునే ఈ సినిమా ఇండియాతోపాటూ అబ్రాడ్లోనూ భారీ వ్యయంతో చిత్రీకరణ జరుపుకుంటుంది.
ఈ నెల 21 న ఈ సినిమా పూజ కార్యక్రమాలను లాంచనంగా జరుపుతామని...శ్రేస్ట్ మూవీస్లో గతంలో వచ్చిన ఇష్క్,గుండేజారి గల్ల౦తయ్యి౦దే లా౦టి విజయాల అన౦తర౦ తీస్తున్న ఈ మూడో సినిమా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని నిర్మాత నికితా రెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, సంగీతం:అనుప్ రూబెన్స్, సినిమాటోగ్రఫి:ఆండ్రూ,ఆర్ట్ రాజీవ్ నాయర్ ,సమర్పణ: విక్రమ్ గౌడ్.
|