Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
then&now  uncle&son..!!

ఈ సంచికలో >> సినిమా >>

'చిత్రం' శ్రీను హీరోగా నూతన చిత్రం

chitram sreenu new movie

250కి పైగా చిత్రాలతో తన నటనతో ఆకట్టుకుని తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు 'చిత్రం' శీను హీరోగా ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. ఐదుసార్లు గిన్నిస్ బుక్  ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుని, ప్రస్తుతం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థాపించి, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇన్నోవేటివ్ డైరెక్టర్ వివేక్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

అపురూప్ మిరాకిల్ మీడియా ఆర్ట్స్ పతాకంపై యం.శివశంకర్ (అపురూప్), గంప సిద్ధలక్ష్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'జబర్ధస్త్' ఫేం 'రచ్చ' రవి ఈ చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తుండగా, అఫ్సర్ అజాద్ విలన్ గా నటించనున్నారు. ఈ చిత్రం ఈ నెలలోనే సెట్స్ మీదుకు వెళ్లనుంది.

తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా ఈ చిత్రం ఉంటుందని, 'గిన్నిస్ బుక్ ఆఫర్ వరల్డ్ రికార్డ్స్'లో ఈ చిత్రం చోటు సంపాదిస్తుందన్న ఆశాభావాన్ని దర్శకులు వివేక్స్ తెలిపారు.

'చిత్రం' శ్రీను సరసన ఓ బాలీవుడ్ హీరోయిన్ నటించనున్న ఈ చిత్రానికి కెమెరా - ఎం.ఎన్.రావ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాసింశెట్టి బాబి, నిర్మాతలు - యం.శివశంకర్ (అపురూప్), గంప సిద్ధలక్ష్మీ, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - వివేక్స్.

మరిన్ని సినిమా కబుర్లు
' yes ' team songs shooting in bangkok