తెలుగులో స్ట్రెయిట్గా తెరకెక్కిన రెండు త్రీడీ సినిమాలు జూన్ 14న విడుదలకు సిద్ధమయ్యాయి. ఒకటి అల్లరి నరేష్ ‘యాక్షన్’ సినిమా కాగా, ఇంకొకటి కళ్యాణ్రామ్ ‘ఓమ్’. ఈ రెండూ భారీయెత్తున విడుదలవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అయితే, అన్ని త్రీడీ థియేటర్లు ఆంధ్రప్రదేశ్లో వున్నాయా? అన్నది ఆలోచించాల్సిన విషయం.
అన్ని థియేటర్లలోనూ త్రీడీ సినిమా విడుదల చేయడమంటే కష్ట సాధ్యమే. అందుకే, కొన్ని థియేటర్లలో త్రీడీ ఫార్మాట్లోనూ, మిగతా థియేటర్లలో మామూలు వెర్షన్నీ విడుదల చేస్తున్నారట రెండు సినిమాల్నీ. ఈ రెండిటిలో ‘ఓం’ ఎక్కువ థియేటర్లలో విడుదలయ్యే అవకాశం వుంది.
చాలాకాలం క్రితం ‘చిన్నారి చేతన’, ‘జై భేతాళ’ సినిమాలు త్రీడీ ఫార్మాట్లో విడుదలయ్యాయిగానీ, ఈ తరం ప్రేక్షకులకి కంప్లీట్ తెలుగు త్రీడీ మూవీలుగా ‘యాక్షన్’, ‘ఓం’ పలకరించనున్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ రెండు త్రీడీ సినిమాల్లో ఏది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో అవి రీలీజ్ అయ్యాక తెలుస్తుంది.
|