'మల్లీశ్వరి' సినిమాతో తెలుగు తెరకు పరిపచయమైన అందాల బొమ్మ కత్రినాకైఫ్, ఆ సినిమాలో మీర్జాపురం మహారాణి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. బాలకృష్ణతో కూడా కత్రినా ఓ సినిమా చేసింది. అయితే తెలుగులో కత్రినాకైఫ్కి సరైన గుర్తింపు రాలేదు. ఇలా తెలుగులో ఆశించినంత ఆదరణ లభించకపోవడంతో బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోగా, అక్కడ ఆమెకు సూపర్ రెస్పాన్స్ దొరికింది. అంతే, కత్రినా ఇక బాలీవుడ్లో ఫిక్స్ అయిపోయింది. మొదట్లో డాన్సుల విషయంలో కొంత ఇబ్బంది పడినా.. 'షీలా కీ జవానీ..' పాటతో డాన్సుల్లో క్వీన్ అనిపించుకుందీ భామ. ప్రస్తుతం నిత్యామెహ్రా దర్శకత్వం వహిస్తున్న 'బార్ బార్ దేఖో' సినిమాలో సిద్దార్ధ్ మల్హోత్రాతో కలిసి నటిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించి ఒక పాట చిత్రీకరణ జరుగుతుండగా సడెన్గా కొరియోగ్రఫర్ మీద కత్రినాకైఫ్ నిప్పులు చెరిగిందట. ఎందుకో మరి ఈ సాఫ్ట్ భామకు అంత కోపం తన్నుకొచ్చింది. కొరియోగ్రాఫర్ బాస్కో ఆధ్యర్యంలో జరుగుతున్న ఈ పాట చిత్రీకరణలో ఆయన తనను పట్టించుకోకుండా సిద్దార్డ్ మల్హోత్రా తదితరులకు డాన్స్ స్టెప్పులు నేర్పించడంతో ఆమెకు కోపం తన్నుకు వచ్చిందట. కొరియోగ్రాఫర్పై గట్టిగా ఆరిచేసి అసహనం వ్యక్తం చేసిందట. దాంతో అమ్మో కత్రినా! అక్కడున్న వారందరూ అవాక్కయినా, వెంటనే ఆమె కూల్ అవడంతో హ్యాపీ ఫీలయ్యారట.
|