మొదటి సినిమా 'ఊహలు గుసగుసలాడే'లో కొంచెం బొద్దుగా, ముద్దుగా అందర్నీ ఆకర్షించింది రాశీ ఖన్నా. ఆ తరువాతి సినిమాలకి మెల్లగా స్లిమ్గా మారి మరింత ఎట్రాక్ట్ చేస్తోంది. 'జిల్' లో తన అందాలతో కుర్రకారును చూపు తిప్పుకోకుండా చేసింది. డిఫరెంట్ ఫీచర్స్తో బోరు కొట్టని అందం రాశి ఖన్నా సొంతం. తాజాగా 'బెంగాల్ టైగర్' సినిమాలో రవితేజతో మాస్ స్టెప్పుల్లో కూడా చిందేసింది. దీంతో క్లాస్, మాస్ ఏదైనా తనకు ఓకే అనిపించేసుకుంది. అందుకే ఈ ముద్దుగుమ్మనే మళ్లీ మళ్లీ హీరోయిన్గా కావాలనుకుంటున్నారట ఈ హీరోలు. రవితేజతో 'బెంగాల్ టైగర్' సినిమాలో సెకండ్ హీరోయిన్గా చేసింది. ఇప్పుడు సోలో హీరోయిన్గా చేయడానికి రెడీ అవుతోంది.
చక్రి అనే కొత్త దర్శకుడితో రవితేజ ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి దామోదర ప్రసాద్ నిర్మాత. ఈ సినిమాలో రవితేజ పక్కన హీరోయిన్గా రాశీ ఖన్నాని కావాలని ఎంచుకోవడం జరిగిందట మన మాస్ రాజా. మరో పక్క గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న ప్రయోగాత్మక చిత్రం 'ఆక్సిజన్'లో కూడా ఈ ముద్దుగుమ్మనే హీరోయిన్. ఇంకో పక్క ఈ భామ హీరోయిన్గా, సాయి ధరమ్ తేజ హీరోగా తెరకెక్కుతున్న 'సుప్రీమ్' సినిమా షూటింగ్ దశలో ఉంది. మొత్తానికి ఈ అమ్మడికి చేతినిండా సినిమాలున్నాయి. ఈ ఏడాది అమ్మడి దశ తిరిగినట్లే అని చెప్పాలి.
|