మామూలుగానే ఇప్పుడు ప్రతి ఒక్కరికీ సెల్ఫోన్ ఎంత అవసరం అయిపోయిందో చెప్పనక్కర్లేదు. అయితే మన ముద్దుగుమ్మ తమన్నాకయితే అవసరమే కాదు.. అస్సలు సెల్ ఫోన్ లేకుండా ఒక్క నిముషం కూడా ఉండలేదంట. అందుకే ఏది మర్చిపోయినా ఎప్పుడూ సెల్ఫోన్ మాత్రం ఎక్కడా మర్చిపోదంట. అంతేకాదంట మొబైల్స్ విషయంలో ఎప్పుడూ అప్డేట్గా ఉంటుందట కూడా. హై ఫీచర్స్ ఉన్న మొబైల్ ఏది కొత్తగా మార్కెట్లోకి వచ్చినా, అది తన చేతిలోకి వచ్చేయ్యాల్సిందే అంటోంది మిల్కీబ్యూటీ తమన్నా. డిఫరెంట్ లొకేషన్స్లో సెల్ఫీలు దిగి ఖాళీగా ఉన్నప్పుడు వాటిని చూసుకుని మురిసిపోతుందట ఈ సెల్ఫీ భామ. అందుకే ఈ మధ్య జరిగిన ఐఫా సెలబ్రేషన్స్లో మెగాస్టార్, చరణ్, మహేష్.. వంటి హీరోలతో సెల్ఫీలు దిగి సంతోషించింది బ్యూటీ తమన్నా. ప్రస్తుతం ఈ సెల్ఫీ భామ 'ఊపిరి' సినిమాలో నాగార్జున, కార్తిలతో కలిసి నటిస్తోంది. 'బాహుబలి' సినిమాతో తమన్నా దశ తిరిగేసింది. 'బాహుబలి' బిగినింగ్లో దుమ్మురేపిన మిల్కీ బ్యూటీకి, 'బాహుబలి' ది కంక్లూజన్లో ఏం చేయనుందోగానీ, మిల్కీ బ్యూటీ ఈజ్ బ్యాక్ అని టాలీవుడ్ ఫిక్సయిపోయింది. నటీనటులతో స్నేహసంబంధాలు, దర్శక నిర్మాతలతో ప్రొఫెషనల్గా సన్నిహితంగా ఉండడం ఇవన్నీ మిల్కీ బ్యూటీ ప్రత్యేకతలు. గ్లామర్, పెర్ఫామెన్స్తో తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకుల్ని అలరిస్తున్న తమన్నా ఇంకా మంచి మంచి సినిమాలతో బిజీ అవ్వాలని కోరుకుందాం.
|