బాలకృష్ణ 100వ చిత్రంగా తెరకెక్కుతోన్న చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి'. క్రిష్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోంది ఈ చిత్రం. శ్రియ కథానాయికగా వస్తోన్న ఈ చిత్రం టీజర్ని దసరాకి విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి అదనపు రంగులు అద్దే పనిలో ఉన్నాడట క్రిష్. విజువల్ వండర్గా తెరకెక్కిన 'బాహుబలి' సినిమాకి మించిపోయే విధంగా ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయని సినీ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. ఇన్సైడ్ సోర్సెస్ సమాచారం ప్రకారం టెక్నికల్ విషయాల్లో ఎక్కడా తగ్గవద్దని నిర్మాతలు క్రిష్కి పూర్తి స్వేచ్ఛనివ్వడంతో హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ని ఈ సినిమా కోసం వినియోగిస్తున్నారట.
చారిత్రక నేపధ్యంలో తెరకెక్కుతోన్న చిత్రంగా వస్తోన్న ఈ సినిమాలో అలనాటి బాలీవుడ్ నటి హేమామాలిని బాలయ్యకు తల్లిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పాత్ర ఎంతో కీలకం ఈ సినిమాకి. ఆమెకూ, బాలయ్యకూ మధ్య వచ్చే సంభాషణలు, సన్నివేశాలు సినిమాకి చాలా హైలైట్గా నిలవనున్నాయి. కాగా హీరోయిన్గా నటిస్తోన్న శ్రియ పాత్రకు కూడా ప్రాధాన్యత చాలా ఎక్కువేనట. ఆమె పలికించే హావభావాల గురించే మాట్లాడుకుంటున్నారు అంతా. ఇంత గొప్పగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. సంక్రాంతి అసలే బాలయ్యకు సెంటిమెంట్. అందులోనూ భారీ అంచనాల నడుమ వస్తోన్న సినిమా కావడంతో బాలయ్యకు ఈ సినిమా చాలా ప్రత్యేకం.
|