ఎట్టకేలకు పవన్కళ్యాణ్, కిషోర్కుమార్ పార్దసాని (డాలీ) కాంబినేషన్లో రూపొందనున్న 'కాటమరాయుడు' చిత్రం సెట్స్ మీదకు వెళుతోంది. రాజకీయాలపై ఇంట్రెస్ట్ చూపుతుండడం వల్ల పవన్కళ్యాణ్ ఈ మధ్య బాగా బిజీ అయిపోయారు. జనసేన పార్టీని విస్తరించాలనే ఆలోచన కారణంగా సినిమా షూటింగ్ని కొంత ఆలస్యం చెయ్యక తప్పలేదు. పవన్కళ్యాణ్ ఏ సినిమా చేసినా 100 పర్సంట్ ఎఫర్ట్ పెడతారు. అదీ ఆయన స్టయిల్. రాజకీయాలకు కొంచెం విరామం ఇచ్చి పూర్తిగా సినిమాపై ఇక నుంచి ఫోకస్ పెట్టనున్నారు. ఈ నెల 20వ తేదీన సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. 24వ తేదీ నుంచి పవన్కళ్యాణ్ సినిమా షూటింగ్లో పాల్గొంటారు.
శృతిహాసన్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. 'గోపాల గోపాల' చిత్రం తర్వాత డాలీ, పవన్కళ్యాణ్తో చేస్తున్న సినిమా ఇదే. ఆ సినిమాలో పవన్కళ్యాణ్ పూర్తిస్థాయిలో హీరోగా కనిపించలేదు. వెంకటేష్ సినిమాలో పవన్కళ్యాణ్ అతిథి పాత్ర పోషించారంతే. ఆ సమయంలో పవన్ ఇచ్చిన హామీతో డాలీ ఇప్పుడు 'కాటమరాయుడు' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్కళ్యాణ్తో వచ్చిన ఛాన్స్ని సద్వినియోగం చేసుకుని, మంచి విజయాన్ని అందుకోవాలని డాలీ భావిస్తున్నాడట. పవన్కళ్యాణ్ సినిమా అంటే ఆ అంచనాలే వేరు. ఆ సంగతి డాలీకి బాగా తెలుసు. అందుకే, అంచనాల్ని అందుకునేలా కాదు, అంచనాల్ని మించే విజయాన్ని అభిమానులకు ఇవ్వాలని డాలీ అనుకుంటున్నాడు.
|