కావైసిన పదార్ధాలు: మటన్ , ఉల్లిపాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సాజీర, పచ్చిమిర్చి, ఉప్పు, కారం , పసుపు, కరివేపాకు, టమాటాలు, గరం మసాలా పొడి, జీడిపప్పు, నిమ్మకాయ
తయారుచేసే విధానం: ముందుగా బాణలి లో నూనె వేసి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సాజీర వేసి ఉల్లిపాయలు, కరివేపాకు వేయాలి. అవి వేగిన తరువాత మటన్ ముక్కలను వేసి కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్ళు పోసి ఉడకనివ్వాలి. ఉడికిన తరువాత గరం మసాలాపొడి వేసి గ్రైండ్ చేసిన జీడిపప్పు పేస్ట్ ను వేసి కలపాలి. చివరగా నిమ్మకాయ రసాన్ని వేసి కలపాలి. అంతే నండీ.. వేడి వేడి మటన్ మసాలా రెడీ..
|