'ఒరేయ్ పండు', 'మౌనమేలనోయి' తదితర చిత్రాలతో ఆకట్టుకున్న నటుడు సచిన్. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ మన ముందుకొస్తున్నాడు. తాతినేని సత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'వీడెవడు' సినిమాలో సచిన్ నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదో క్రైమ్ థ్రిల్లర్ మూవీ. కథ చాలా కొత్తగా ఉండబోతోందట. గత చిత్రాల్లో లవర్ బోయ్లా ఆకట్టుకున్న సచిన్ ఈ సారి మెచ్యూర్డ్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. బాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ బ్యూటీ ఇషా గుప్తా ఈ సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇవ్వనుంది.
ప్రస్తుతం క్రైమ్, థ్రిల్లర్ మూవీస్కి బాగా ఫాలోయింగ్ ఉంది ప్రేక్షకుల్లో. అందుకే లాంగ్ గ్యాప్ తర్వాత మంచి కథతో వస్తున్నాడు హీరో సచిన్ జోష్. ఈ సినిమా తనకి ఖచ్చితంగా విజయం తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాడు. ఇంతవరకూ చాలా లవ్ స్టోరీస్లో నటించాడు సచిన్. ఇన్నోసెంట్ లవర్గా అమ్మాయిల హృదయాలు కొల్లగొట్టేశాడు. మోడలింగ్లోనూ ప్రావీణ్యం ఉంది. కానీ అవేమీ తనకు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. వాటిన్నింటికీ భిన్నంగా వస్తోన్న 'వీడెవడు' చిత్రం తనకి మంచి గుర్తింపు తెచ్చి పెడుతుందని ఆశిస్తున్నాడు సచిన్. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందింది. వచ్చే నెల్లో ఈ సినిమా విడుదల కానుంది.
|