అక్కినేని వారింట పెళ్లి సందడి మొదలైంది. వచ్చే నెల్లోనే అక్కినేని వారింట పెళ్లి బాజా మోగనుంది. అక్టోబర్ 6న నాగచైతన్య - సమంతల వివాహానికి ముహూర్తం కుదిరిన సంగతి తెలిసిందే. గోవాలో వీరి పెళ్లి అంగ రంగ వైభవంగా జరగనుంది. ఆ వివాహ మహోత్సవానికి సినీ, రాజకీయ అతిరధ మహారధులకు ఆహ్వానాలు అందాయి. గోవాలో ఘనంగా ఈ వివాహ మహోత్సవం జరగనుంది.
హిందూ, క్రిష్టియన్ సాంప్రదాయాల్లో వీరి వివాహం జరగనుంది. అయితే గోవాలో వివాహ మహోత్సవానికి సెలెక్ట్డ్ పీపుల్ని మాత్రమే ఆహ్వానించారు. వివాహానంతరం హైద్రాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఉంది. అత్యంత భారీగా ఈ రిసెప్షన్ వేడు జరగనుంది. ఈ వేడుకకు మాత్రం పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరవుతారు. సినీ రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులూ ఈ వేడుకలో కనిపించనున్నారు. చాలా కాలం క్రితమే ప్రేమలో పడ్డ సమంత, నాగచైతన్య, తమ ప్రేమ విషయాన్ని తమ పెద్దలకు తెలియజేయడం, వారి పెద్దలు తమ పిల్లల ప్రేమని అంగీకరించడం, అలా వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేయడం జరిగాయి. ఇంకో వైపున చైతూ - సమంత ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రస్తుతం. వివాహ వేడుకల సందడి అనంతరం, చిన్న గ్యాప్ తర్వాత తిరిగి సినిమాల్లో బిజీ కానున్నారు ఈ ఇద్దరూ. సమంత ప్రస్తుతం 'రంగస్థలం' సినిమాలో నటిస్తోంది. ఆమె గెస్ట్ రోల్లో నటించిన 'రాజుగారి గది - 2' విడుదలకు సిద్ధంగా ఉంది. చైతూ ఇటీవలే 'యుద్ధం శరణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చందూ మొండేటితో 'సవ్యశాచి' సినిమా చేస్తున్నాడు.
|