కావలిసిన పదార్ధాలు: పెసరపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, నిమ్మకాయ,టమాటాలు, కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర
తయారుచేసే విధానం: ముందుగా పెసరపప్పును ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిన పప్పులో పసుపు , ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత బాణలి లో నూనె వేసి పోపుదినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి టమాటాలను వేయాలి. అవి బాగా మగ్గిన తరువాత ఉడికిన పెసరపప్పును అందులో వేసుకోవాలి. కారం ఎక్కువగా తినే వాళ్ళు కారం వేసుకోవచ్చు. లేదంటే ఎండు మిర్చి, పచ్చిమిర్చి తో సరిపెట్టుకోవచ్చు. చివరగా నిమ్మరసాన్ని, కొత్తిమీరను వేయాలి. అంతేనండీ వేడి వేడి పెసర పప్పు టొమాటొ రెడీ..
|