పవన్ మాజీ భార్య, హీరోయిన్ రేణూదేశాయ్ టాలీవుడ్కి రీ ఎంట్రీ ఇస్తోంది. 'బద్రి', 'జానీ' చిత్రాల్లో నటించిన రేణూదేశాయ్ తర్వాత పవన్ కళ్యాణ్ని వివాహం చేసుకుని సినిమాలకు గుడ్బై చెప్పేసింది. హీరోయిన్గానే కాకుండా పవన్ కళ్యాణ్ నటించిన, 'ఖుషీ', అన్నవరం' తదితర కొన్ని చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేసింది. 2014లో 'ఇష్క్ వాలా లవ్' మరాఠీ మూవీకి దర్శకత్వం వహించారు. ఎడిటింగ్లో కూడా రేణూదేశాయ్కి అనుభవం ఉంది. ఇదిలా ఉంటే టాలీవుడ్కి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నానంటూ రేణూదేశాయ్ తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. వంశీ కృష్ణ ('దొంగాట' ఫేం) దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో సామాజికవేత్త, రచయిత హేమలత లవణంగారి పాత్రలో నటిస్తున్నానని రేణూదేశాయ్ తెలిపారు.
ఇది కాకుండా మరో ముఖ్యమైన ప్రాజెక్టుపై కూడా సైన్ చేశాననీ, త్వరలోనే ఆ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాననీ ట్విట్టర్ ద్వారా కన్ఫామ్ చేశారు. ఇప్పటికే పలువురు సీనియర్ హీరోయిన్లు టాలీవుడ్కి రీ ఎంట్రీ ఇచ్చి మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. మంచి గుర్తింపు కూడా పొందుతున్నారు. రేణూదేశాయ్ వంటి మల్టీ టాలెంటెడ్ టాలీవుడ్కి రీ ఎంట్రీ ఇస్తే, అవకాశాలు కోకొల్లలే అని చెప్పాలి. ఈ సంగతిటుంచితే ఈ మధ్య రెండో వివాహం పేరు చెప్పి, సోషల్ మీడియా వేదికగా రేణూదేశాయ్ తెగ హల్చల్ చేశారు. ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కానీ తర్వాత పెళ్లి విషయమై క్లారిటీ లేదు కానీ, ప్రస్తుతానికైతే ఆమె దృష్టి నటన వైపు మళ్లిందని స్పష్టమైంది.
|