సూపర్ స్టార్ మహేష్బాబు ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం కాశ్మీర్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్గా నటిస్తున్నారన్న ప్రచారం జరిగింది. ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ, లీకేజీ భూతం అని ఒకటుంది కదా.. ఎంత దండించినా ఈ భూతం తన పని తాను సైలెంట్గా చేసుకుంటూనే పోతోంది. మహేష్బాబు క్యారెక్టర్ విషయమై జరుగుతోన్న ప్రచారాన్ని నిజం చేస్తూ లుక్తో సహా సైలెంట్గా లీక్ చేసేసింది. దాంతో చిత్రయూనిట్ అప్రమత్తమై మహేష్ పాత్రకు సంబంధించిన డీటెయిల్స్ని అఫీషియల్గా ప్రకటించాల్సి వచ్చింది. ఆయన పేరు మేజర్ 'అజయ్ కృష్ణ' అని బ్యాడ్జ్తో సహా లోగో రిలీజ్ చేసింది. కశ్మీర్లో ఇంపార్టెంట్ సీన్స్ చిత్రీకరణలో ఉండగా, ఆన్ లొకేషన్ మహేష్ లుక్స్ లీక్ అవడంతో, చిత్రయూనిట్ ఇలా తొందరపడాల్సి వచ్చింది. కొన్ని కోట్లు ఖర్చుపెట్టి తీస్తున్న సినిమాలు. ప్రేక్షకుల్లో అంచనాలు పెంచడం కోసం కొన్ని సీక్రెసీలు మెయింటైన్ చేయాల్సి వస్తుంది.
సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ ఇవ్వడానికైనా, ఓ టైమింగూ, సెంటిమెంటూ.. గట్రా చూసుకోవాలని చిత్రయూనిట్ భావిస్తుంటుంది. కానీ, ఈ లీకేజీ భూతానికి అడ్డుకట్ట వేయడం కష్టమయిపోతోంది. ఫోటో లీకైన నెక్ట్స్ డేనే పేరు ప్రకటించాల్సి వచ్చింది. టైటిల్ విషయంలోనూ అలాగే జరిగింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ జరక్కుండానే ముందుగా లీకైపోయింది. దాంతో అఫీషియల్గా స్పందించాల్సి వచ్చింది. ఏది ఏమైతేనేం, మొత్తానికి సూపర్ స్టార్ సినిమాని లీకేజీ భూతం మొదట్నుంచీ అలా భయపెట్టేస్తూనే ఉంది. ఇకపోతే, సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రష్మికా హీరోయిన్గా నటిస్తోంది.
|