పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్' స్టైల్లో, ఇస్మార్ట్ అంచనాలతో, ఇస్మార్ట్ మాస్ కంటెంట్తో రూపొందుతోన్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా ఇస్మార్ట్ స్టైల్లోనే జరుగుతోంది. సో ప్రేక్షకులకు ఇస్మార్ట్ కిక్ ఇచ్చేలానే ఉందీ సినిమా. సూపర్.. ఇట్స్ ఓకే.. బట్ ఈ నెల 18న రిలీజ్కి రెడీగా ఉన్న ఈ సినిమాని తాజాగా ఓ వివాదం వెంటాడుతోంది. అదే కథ విషయం. తన కథని కాపీ కొట్టేశారంటూ ఓ యంగ్ టాలెంట్ ఈ సినిమాపై వివాదం లేవనెత్తాడు. సదరు యంగ్ టాలెంటెడ్ ఈ కథ పట్టుకుని కొంతమంది హీరోల్ని కలిశాడట. పేరున్న హీరోలతోనే ఈ సినిమా తెరకెక్కించాలనుకున్నాడట. కథతో పలువురు హీరోల్ని ఇంప్రెస్ చేశాడు కానీ, డైరెక్షన్కి ఆ హీరోలు ఒప్పుకోలేదట. స్టోరీ ఇచ్చేయమని ఆడిగారట. కానీ, సదరు యంగ్స్టర్ అందుకు సమ్మతించలేదట.
ఆ కథతో తాను డైరెక్టర్ కావాలన్నదే తన కోరిక అనీ చెబుతున్నాడు. ఈ విషయాన్ని సదరు వ్యక్తి తాజాగా ఛాంబర్ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాడనీ సమాచారం. ఒకవేళ అదే జరిగితే, ఛాంబర్ పెద్దల నుండి ఆ వ్యక్తికి ఎలాంటి న్యాయం జరుగుతుందో, 'ఇస్మార్ట్ శంకర్' రిలీజ్కి అది ఏ విధమైన అడ్డంకి కానుందో కానీ, సినిమా రిలీజ్కి దగ్గరైన తరుణంలో ఈ తాజా అప్డేట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. రామ్ పోతినేని హీరోగా, నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా 'ఇస్మార్ట్ శంకర్' రూపొందిన సంగతి తెలిసిందే.
|