Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

సరిలేరు'కు మరో అతిథి.?

mahesh babu nex movie sarileru neekevvaru

స్టార్‌డమ్‌ ఉన్న ఆర్టిస్టులు ఇతర సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపిస్తే ఆ కిక్కే వేరప్పా. అలాంటి అతిథి పాత్రలు ఇదివరకట్లో చాలా అరుదుగా కనిపించేవి. కానీ, ఇప్పుడు ఆయా పాత్రలకు పెరిగిన క్రేజ్‌తో అతిథి పాత్రలకు కూడా మంచి క్రేజ్‌ దక్కుతోంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన 'గద్దలకొండ గణేష్‌' చిత్రంలో అతిథి పాత్రలో కనిపించి మంచి పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ పూజాహెగ్దే ఇప్పుడు మరో అతిధి పాత్రకు ముస్తాబవుతోంది.

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరూ..' సినిమాలో పూజీ కోసం ఓ గెస్ట్‌ రోల్‌ సిద్ధమవుతోందట. దర్శకుడు అనిల్‌ రావిపూడి ఆ పాత్రను పూజా హెగ్దేతోనే చేయించాలని డిసైడ్‌ అయ్యాడట. పూజాతో ఆల్రెడీ మంతనాలు కూడా జరిపాడట. పూజా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందనీ సమాచారం. అంటే, పూజా ఖాతాలో మరో గెస్ట్‌ రోల్‌ రెడీ అయ్యిందన్న మాట. ఈ సినిమాలో మెయిన్‌ లీడ్‌ హీరోయిన్‌గా రష్మికా మండన్నా నటిస్తుండగా, స్పెషల్‌ సాంగ్‌లో తమన్నా కనిపించనుంది. ఇక తాజాగా పూజా హెగ్దే పేరు తెరపైకి రావడంతో మహేష్‌బాబు సినిమాకి సూపర్బ్‌ గ్లామర్‌ యాడ్‌ అయినట్లయ్యింది. మరోవైపు ఈ సినిమాలో సీనియర్‌ నటి లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి మరో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో దిల్‌రాజుతో కలిసి మహేష్‌బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా కబుర్లు
bigboss climax