ఈ ఏడాది ఏ స్టార్ హీరోకీ, యంగ్ హీరోకీ లేనంత క్రేజ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్కి దక్కింది. ఏడాదికి ఒక్క హిట్ కొట్టడమే కష్టమైపోతున్న తరుణంలో ఏడాదిలో రెండు బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకున్నాడు వరుణ్ తేజ్. ఏడాది మొదట్లో సంక్రాంతికి 'ఎఫ్ 2'తో వచ్చి దుమ్ము రేపాడు. లేటెస్ట్గా 'గద్దలకొండ గణేష్'తో వచ్చి గత్తర గత్తర చేశాడు. దీంతో వరుణ్ తేజ్ నిర్మాతలకు బంగారంగా మారిపోయాడు. ఆయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కట్టేస్తున్నారట. ఇదే జోరులో కొత్త సినిమానీ ప్రారంభించేశాడు మనోడు. కిరణ్ కొర్రపాటి ఈ సినిమాకి దర్శకుడు. నభా నటేష్ హీరోయిన్గా నటిస్తోంది.
ఇటీవలే ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించారు. నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఇదిలా ఉంటే, ఈ మెగా రాకుమారుడు సడెన్గా రెమ్యునరేషన్ పెంచేశాడంటూ బలంగా టాక్ సర్క్యులేట్ అవుతోంది. ఇంతవరకూ 2 నుండి 3 కోట్ల వరకూ ఉండే వరుణ్ రెమ్యునరేషన్ రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ రావడంతో, ఏకంగా 7, 8 కోట్లు వరకూ వెళ్లిపోయిందంటున్నారు. ఈ రూమర్లో నిజమెంతో తెలీదు కానీ, ప్రస్తుతం వరుణ్కున్న క్రేజ్ని బట్టి, స్టార్ హీరోల రేంజ్ రెమ్యునరేషన్ అందుకునే అర్హత లేకపోలేదని గట్టిగానే చెప్పేయొచ్చు.
|