హీరోయిన్ లావణ్య త్రిపాఠి తొలి సినిమా ‘అందాల రాక్షసి’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిన్న సినిమాగా వచ్చి ప్రేక్షకుల మన్ననల్ని అందుకుని కమర్షియల్గా విజయం సాధించింది అందాల రాక్షసి. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి సరసన ఓ హీరోగా నవీన్ చంద్ర నటించాడు. అతనికీ మంచి గుర్తింపు ఇచ్చింది ఈ సినిమా.
లావణ్య త్రిపాఠి, నవీన్ చంద్ర విడివిడిగా పలు సినిమాలు చేశారు. ఇప్పుడు వీరిద్దర్నీ మళ్ళీ జంటగా చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. కొత్త దర్శకుడు జగదీష్ ఈ జంటను డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారమ్. ‘అందాల రాక్షసి’ ఫేం నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా నటించే కొత్త సినిమా వచ్చే ఏడాది జనవరిలో లాంఛనంగా ప్రారంభం అవుతుందట.
లావణ్య త్రిపాఠి ఇప్పుడు నాగార్జునతో ఓ సినిమాలో హీరోయిన్గా నటించేందుకు కమిట్ అయ్యింది. తొలి సినిమాలో ముద్దుముద్దుగా కనిపించిన లావణ్య, విష్ణుతో నటించిన ‘దూసుకెళ్తా’ సినిమాలో కొంచెం హాట్గా కనిపించింది. నటిగా ఇప్పటికే మంచి మార్కులేయించుకున్న లావణ్య, నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న నవీన్ చంద్ర ఈసారెలాంటి హిట్ కొడతారో చూడాలి.
|