ఎన్నో సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన ప్రముఖ గాయకుడు విస్సంరాజు రామకృష్ణ అనారోగ్యంతో కన్నుమూశారనే వార్త నిన్నటితరం సినీ పాటల ప్రియుల్ని షాక్కి గురిచేసిందనడం అతిశయోక్తి కాదు. రామకృష్ణ పాటల్లో ఆర్ద్రతను, స్పష్టతనూ తెలుగు సినీ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. భక్తి పాటలంటే ఘంటసాల తర్వాత రామకృష్ణ మాత్రమే పాడాలి అనేంతగా రామకృష్ణ పేరు మార్మోగిపోయింది. ఇప్పుడంటే వాయిద్యాల హోరులో ఎవరేం పాట పాడుతున్నారో తెలియదుగానీ, గత కాలపు రోజుల్లో గాయకుడి గాత్ర మాధుర్యానికి సంగీత దర్శకులే ఫిదా అయ్యేవారు. ఆ టైమ్లో రామకృష్ణ గాయకుడిగా చెలరేగిపోయారు. పాటంటే ఇలా ఉండాలి, పాటకు ప్రాణం పోయగలిగేవాడే నిజమైన గాయకుడు అని రామకృష్ణను ప్రతి ఒక్కరూ కొనియాడేవారు. అనారోగ్యంతో కన్నుమూసిన రామకృష్ణకు రాజకీయ, సినీ ప్రముఖులు ఘన నివాళి అర్పించారు. రామకృష్ణ లేకపోయినా ఆయన పాడిన పాటలుతెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
|