'గోపాల గోపాల' సినిమా వచ్చి చాలా కాలమే అయ్యింది. ఆ సినిమా తరువాత వెంకీ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నో స్టోరీలు విని చివరికి మారుతి డైరెక్షన్లో 'బాబు బంగారం' అనే సినిమాకు ఓకే చెప్పాడు వెంకీ. ఎలాగో ఈ సినిమా సెట్స్ మీదికెళ్లింది. సైలెంట్గా అయినా, ఫాస్ట్గానే ఈ సినిమా షూటింగ్ జరిగిపోతోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న నయనతార షూటింగ్ పార్ట్ ఇంకా కంప్లీట్ కాలేదట.
ఈ సినిమాను మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం కసరత్తులు చేస్తోందట. కానీ ముద్దుగుమ్మ నయనతార తమిళ చిత్రాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమా మరి కాస్త లేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఎలాగయినా సమ్మర్కు ఈ సినిమాను విడుదల చేయాలనే గట్టి పట్టు మీదున్నాడట వెంకటేష్. ఇదిలా ఉండగా ఈ లోపు వెంకీ కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేసే పనిలో బిజీగా ఉన్నాడట. తాజాగా బండ్ల గణేష్ రీమేక్ చేయబోతున్న కొత్త సినిమాలో వెంకీ హీరోగా నటిస్తాడనే టాక్ నడుస్తోంది. అసలే వెంకీకి రీమేక్లంటే మహా ఇష్టం. అందులోనూ ఈ సినిమా కథ కూడా బాగా నచ్చడంతో వెంకీ నెక్స్ట్ మూవీ బండ్ల గణేష్ నిర్మాణంలో ఉండవచ్చని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
|