ముప్పై సంవత్సరాల క్రితం సంచలన విజయాన్ని అందుకున్న ‘లేడీస్ టైలర్’ చిత్ర నిర్మాత స్రవంతి రవి కిషోర్, ఇప్పుడు ఆ లేడీస్ టైలర్ సీక్వెల్ గా వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్’ రెండవ పాటను విడుదల చేసారు. ‘రవివర్మ చిత్రమా...’ అనే పల్లవితో మొదలయ్యే ఈ పాటను చైతన్య ప్రసాద్ రాయగా, శ్రీకృష్ణ, హరిణి ఇవటూరి పాడారు.
ఈ సందర్భంగా స్రవంతి రవి కిషోర్ మాట్లాడుతూ, “వంశీ గారి దర్శకత్వంలో నేను నిర్మించిన ‘లేడీస్ టైలర్’ అప్పుడు ఒక సెన్సేషన్. నేను నిర్మాతగా అది మొదటి చిత్రం. ఇప్పుడు ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ వంశీ గారి దర్శకత్వంలో సీక్వెల్ రావడం చాలా థ్రిల్లింగా వుంది. మణిశర్మ సంగీతం సూపర్బ్. గోదావరి అందాలను వంశీ గారు చిత్రీకరించినట్టుగా ఇంకెవరు చెయ్యలేరు. టీం మొత్తానికి నా బెస్ట్ విషెస్” అన్నారు.
మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం వేసవి కానుకగా మే మూడో వారంలో ప్రేక్షకుల ముందుకి రానుంది. గత వారం విడుదలైన ‘పాపికొండల్లో’ అనే మొదటి పాట ఇప్పటికే ప్రేక్షక ఆదరణ పొంది, టాప్ ఫైవ్ చార్ట్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.
|