బెజవాడ కాలేజీ గొడవల నేపథ్యంలో తెరకక్కిన సినిమా 'శివ'. రామ్గోపాల్ వర్మ - నాగార్జున కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కింది. అప్పట్లో ఓ సెన్సేషన్ ఈ సినిమా. చాలా కాలం తర్వాత ఈ కాంబినేషన్లో సినిమా రాబోతోంది. ఇదేం గాసిప్ కాదు అచ్చంగా నిజమే. వర్మ ఈ విషయాన్ని అపీషియల్గా ప్రకటించేశారు కూడా. అలాగే నాగార్జున సైడ్ నుండి ఓకే అని సంకేతాలు కూడా వచ్చేశాయి. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్. ఈ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'శివ'కి సీక్వెల్ మాత్రం కాదు. ఓ మంచి యాక్షన్ ఎంటర్టైనర్. అలాగే ఇంతవరకూ ఇలాంటి కాన్సెప్ట్ని డైరెక్టర్గా వర్మ కానీ, హీరోగా పలు చిత్రాలు చేసిన నాగార్జున కానీ టచ్ చేయలేదంట. ఇద్దరికీ ఓ న్యూ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా అంటున్నాడు నాగార్జున.
అయితే ప్రస్తుత తరుణంలో నాగార్జున వర్మతో సినిమా చేయడమేంటనీ అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అంటే ఎప్పుడూ 'కొత్త డైరెక్టర్స్తో సినిమాలు చేసే నాగార్జున వర్మతో సినిమా చేయడమేంటనుకుంటున్నారు. అయితే కొత్త డైరెక్టర్స్ కొత్త కొత్త కథలను తీసుకొస్తారు కాబట్టి ఆ సినిమాల్లో నటిస్తాను. అదే కొత్త కథలు పాత డైరెక్టర్స్ తీసుకొచ్చినా నటిస్తాను. కథలో కొత్తదనం తనకి కావాల్సింది కానీ, డైరెక్టర్స్లో కాదు..' అని నాగ్ అన్నారు. ఏదైనా నాగార్జున రూటే సెపరేటు. అన్నట్లు నానితో ఓ మల్టీ స్టారర్ సినిమాలోనూ నటిస్తున్నాడు నాగార్జున. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమా తెరక్కెనుంది. త్వరలోనే 'రాజుగారి గది - 2'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నాగార్జున.
|