అలనాటి అందాల తార శ్రీదేవి అంటే కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందానికి చిరునామా. తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. ఆ అతిలోక సుందరి కుమారై జాహ్నవి తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఫస్ట్లుక్ లాంఛ్ చేశారు. 'ధడక్' సినిమా ద్వారా ఈ ముద్దుగుమ్మ పరిచయం కాబోతోంది. చిన్న సినిమాగా విడుదలై సెన్సేషనల్ విజయం అందుకున్న మరాఠీ చిత్రం 'సైరాత్'కి ఇది హిందీ రీమేక్గా తెరకెక్కుతోంది.
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖత్తర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ధర్మా ప్రొడక్షన్స్, జీ స్టూడియో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శశాంక్ ఖైతర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో జాహ్నవి ఫస్ట్లుక్ వచ్చేసింది. కూతుర్ని హీరోయిన్గా పరిచయం చేసేందుకు శ్రీదేవి చాలా కసరత్తులే చేసింది. ముందగా ఆమె స్వయంగా రీ ఎంట్రీ చేసింది. 'ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రంలో నటించింది. తమిళంలో 'పులి' చిత్రంలో నటించింది. రీ ఎంట్రీలోనూ ఆమెకు అదే స్వాగతం, అభిమానం దక్కాయి. ఇటీవలే 'మామ్' చిత్రంతో యాక్టింగ్లో భళా అనిపించింది. కూతురుగా జాహ్నవిని అందంగా మలచేందుకు కసరత్తులు చేసింది. యాక్టింగ్ నేర్పించింది. డాన్సులు నేర్పించింది. చివరికి అందరికీ షాకిచ్చేలా జాహ్నవి ఫస్ట్లుక్ వచ్చేసింది. 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమా సీక్వెల్లో జాహ్నవి నటిస్తుందంటూ గాసిప్స్ వచ్చాయి. అలాగే అక్కినేని అఖిల్ సినిమాతో జాహ్నవి ఎంట్రీ ఉండబోతోందంటూ మరో పక్క గాసిప్స్ వచ్చాయి. కానీ ఇవేమీ నిజం కాలేదు. ఎలాగోలా మొత్తానికి శ్రీదేవి కూతురు ఎంట్రీ ఇచ్సేసింది. కాబట్టి తెలుగు తెర పైనా జూనియర్ అతిలోక సుందరి సందడి చేస్తుందేమో చూడాలిక.
|