అక్కినేని ఫ్యామిలీ ప్రస్తుతం తమ తమ సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఈ మధ్య నాగచైతన్య, సమంతల వివాహం పేరు చెప్పి ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా సినిమాల నుండి కొంచెం రెస్ట్ తీసుకుని ఫ్యామిలీతో సరదాగా గడిపారు. ఇక ఇప్పుడు షూటింగ్స్తో బిజీ కానున్నారు. ఇప్పటికే కొత్త పెళ్లికొడుకు నాగ చైతన్య సెట్స్లోకి అడుగుపెట్టేశాడు. చందూ మొండేటి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న 'సవ్యసాచి' సినిమాలో నటిస్తున్నాడు నాగ చైతన్య. ఆ సినిమా షూటింగ్తో చైతూ బిజీ అయిపోయాడు. మరో పక్క అఖిల్ 'హలో'తో బిజీగా ఉన్నాడు. విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక నాగార్జున - రామ్గోపాల్ వర్మ సినిమాతో బిజీ కానున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. అది కూడా రేపో మాపో కావచ్చు.
ఇక అక్కినేని వారి కోడలు సమంత విషయానికి వస్తే, ప్రస్తుతం 'రంగస్థలమ్' సినిమాలో నటిస్తోంది సమంత. ఇందులో సమంత ఇంతవరకూ చేయని సరికొత్త పాత్రను పోషిస్తోంది. రామ్చరణ్తో తొలి సారిగా జత కడుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారీ సినిమాకి. కాగా మరోపక్క 'మహానటి' సినిమాలోనూ నటిస్తోంది. అలనాటి మహానటి సావిత్రి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంత కీలక పాత్ర పోషిస్తోంది. ఇవన్నీ కాక తాజాగా మరో కొత్త సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. ఈ సినిమాలో సమంత విశాల్కి జోడీగా నటిస్తోంది. 'అభిమన్యు' అని ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది. ఇలా అక్కినేని ఫ్యామిలీ అంతా సినిమాలతో బిజీ కానున్నారు. ఇవన్నీ కాక మరికొన్ని కొత్త స్టోరీలను సమంత వింటున్నట్లుగా సమాచారమ్.
|