కావలసిన పదార్థాలు:
పచ్చి మెత్తళ్ళు, కారం, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లి, వెల్లుల్లి, జీలకర్ర మిశ్రమం
తయారు చేయు విధానం:
నూనె వేడిచేసాక దానిలో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తరువాత చీరిన పచ్చిమిర్చి వేయాలి. తరువాత నూనెలో ఉల్లి ముద్ద వేసి బ్రౌన్ కలర్ వచ్చేలా వేపాలి. తరువాత ఉప్పు, కొద్దిగా పసుపు, సరిపడా కారం వేసి తరువాత బాగా కలపాలి. తరువాత పచ్చి మెత్తళ్ళు వేసుకుని మృదువుగా కలపాలి. తరువాత కొద్దిగా వాటర్ వేయాలి. వాటర్ వేసిన తరువాత సన్న మంట మీద పెట్టి మూత వేయాలి. ఉడికిన తరువాత పైన కొత్తిమీర వేసుకుంటే మెత్తళ్ళు కూర రెడీ.
|