మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'తేజ్ ఐ లవ్యూ' ఆడియో ఫంక్షన్ ఈ నెల 9న జరగనుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వస్తున్నాడన్న విషయం కన్ఫామ్ అయిపోయింది. చిత్ర యూనిట్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించింది. అయితే ఈ ఆడియో ఫంక్షన్కు పవర్స్టార్ పవన్ కళ్యాణ్ని కూడా రప్పించే ప్రయత్నంలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్కి ముగ్గురు మేనమామల్లో అత్యంత ప్రియమైన మేనమామ పవర్స్టార్ పవన్ కళ్యాణ్. అందుకే తన సినిమా ఆడియో ఫంక్షన్కి పవన్ని కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేశాడట తేజు. అంతేకాదు, ఎన్నో లవ్ స్టోరీస్ని సక్సెస్ఫుల్గా తెరకెక్కించిన కరుణాకరన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ' సినిమాతోనే కరుణాకరన్ డైరెక్టర్గా పరిచయమయ్యాడు. మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత మెగా కాంపౌండ్ హీరోతో కరుణాకరన్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో, మెగా ఫ్యామిలీ నుండి మెగాస్టార్నీ, పవర్స్టార్నీ ఈ సినిమాకి ఛీఫ్ గెస్ట్లుగా ఆహ్వానించే పనిలో కరుణాకరన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రకంగా కూడా పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు వచ్చే అవకాశాలున్నాయి. అంతేనా? ఈ మధ్య పవన్ కళ్యాణ్ చాలా మారిపోయాడు. ఓ పక్క జనసేన అధినేతగా జనంలో తిరుగుతూనే, మరో వైపు సినిమా ఫంక్షన్స్లోనూ యాక్టివ్గా పాల్గొంటున్నాడు. సో ఇంతగా రిక్వెస్ట్ చేస్తే 'తేజ్' ఆడియో ఫంక్షన్కి చిరంజీవితో పాటు, పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశాలు లేకపోలేవు. ఒకవేళ ఇది కన్ఫామ్ అయితే మెగా ఫ్యాన్స్కి పండగే పండగ. చిరంజీవినీ, పవన్ కళ్యాణ్నీ ఒకే వేదికపై చూసే అవకాశం మరోసారి కలగనుంది.
|