యాక్షన్ ప్రధానాంశంగా తెరకెక్కుతోన్న 'సైరా నరసింహారెడ్డి' సినిమాకి సంబంధించిన ఫ్రెష్ అప్డేట్ ఏంటంటే, ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్కి డూప్స్ లేకుండా ఫైట్లు చేస్తున్నాడట చిరంజీవి. మొదట్లో లైటర్ వింగ్లో యాక్షన్ సీన్స్ తీసేద్దామని అనుకున్నారట. అయితే చిరంజీవి ససేమిరా అనుకున్నాడట. దాంతో రామ్చరణ్, సురేందర్ రెడ్డిలు పునరాలోచన చేసి, క్రిటికల్ ఫైట్స్ని కూడా సహజంగా తెరకెక్కిస్తున్నారట. చిరంజీవి అంటేనే కమిట్మెంట్. ఎన్టీఆర్, ఏఎన్నార్ కృష్ణ కాలంలో ఫైట్ సీన్స్ అంటే డూప్స్ లేకుండా పనయ్యేది కాదు. టిపికల్ షాట్స్లో డూప్స్తోనే కానిచ్చేసేవారు. అలాంటిది చిరంజీవి వచ్చాక ఆ సాంప్రదాయం మారిపోయింది. అందుకే చిరంజీవి యూత్ ఐకాన్ అయిపోయాడు. అదే ట్రెండ్ ఇప్పటికీ ఫాలో చేస్తున్నాడు.
పెరిగిన వయసు రీత్యా రిస్కీ షాట్స్కి చరణ్, సురేందర్ రెడ్డి అభ్యంతరం చెబుతున్నా, చిరంజీవి ఒప్పుకోవడం లేదట. అంటే ఈ సినిమాని చిరంజీవి ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడో అర్ధం చేసుకోవచ్చు. యాక్షన్ ప్రధానాంశంగా సాగే 'సైరా' సినిమాలో యుద్ద నేపథ్యంలో సాగే యాక్షన్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ కొరియోగ్రాఫర్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. హైద్రాబాద్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొన్ని సెట్స్లో ఈ యాక్షన్ సీన్స్ని చిత్రీకరణ జరుగుతోంది. అలాగే కొన్ని మార్పులు చేర్పులు చేసి, 'రంగస్థలం' సెట్ని కూడా ఈ సినిమా కోసం ఉపయోగించుకోనున్నారట. బిగ్బి అమితాబ్ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌత్ క్వీన్ నయనతార హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మిల్కీబ్యూటీ తమన్నా కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోందీ సినిమాలో. ఇకపోతే మరో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, ఈ చిత్రాన్ని మొదట్లో 2019 సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ కఠినమైన యాక్షన్ ఎపిసోడ్స్కి మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశమున్న నేపథ్యంలో 'సైరా' విడుదల సమ్మర్కి వెళ్లిందని తాజా సమాచారమ్.
|